టిఆర్ఎస్ మండల యువత అధ్యక్ష కార్యదర్శులు ఎన్నిక

Published: Tuesday September 28, 2021
 బోనకల్, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మండల టిఆర్ఎస్ యువత అధ్యక్ష కార్యదర్శులు కన్నీటి సురేష్, షేక్ నజీర్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్మల్ని నియమింప చేసినందుకు రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ మధిర నియోజకవర్గం ఇంచార్జ్ లింగాల కమల్ రాజు, ఖమ్మం జిల్లా యూత్ అధ్యక్షులు చింత నిప్పు చైతన్య, మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు కు అభినందలు తెలియజేస్తూ మధిర నియోజకవర్గంలో బోనకల్ మండలంలో యువతని టిఆర్ఎస్ కమల్ రాజు సైన్యంగా తయారుచేసి తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం అని కేటీఆర్ యువతకు పార్టీలో అధిక ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అభివృద్ధి చెందుతుందనివారు అన్నారు. అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర మార్గదర్శనంలో నడుస్తామని ఆన్నారు. మాకు ఈ పదవులు రావటానికి కృషిచేసిన మండల అధ్యక్ష కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగు నాగేశ్వరరావుతో పాటు ఇతర టిఆర్ఎస్ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.