కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినారు ఓరెగటి వెంకటేశం గౌడ్ *

Published: Tuesday October 18, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేలకోట్ల కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానాన్ని అమిత్ షా కాళ్ళ ముందు పెట్టి ఉపఎన్నిక తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర నాయకులు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరెగటి వెంకటేశం గౌడ్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని తెరాస కార్యాలయంలో తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరగంటి వెంకటేశం గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలిస్తే వృద్ధులకు 3000 పింఛన్ ఇస్తామని ₹3,000 కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులు తీసుకొస్తామని తెలియజేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిజంగా మునుగోడు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే మోడీ, అమిత్ షా, ను మునుగోడుకు రప్పించి ప్రజల సమక్షంలో వారి చేత ప్రకటించాలని సవాల్ విసిరారు. మునుగోడు అభివృద్ధి కేవలం తేరాసా తోనే సాధ్యపడుతుందని అన్నారు. కెసిఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను చూసి భాజాపా పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 2000 రూపాయల పింఛన్ ఇస్తున్నారని బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ ఇస్తున్నారని భాజపా నాయకులు సమాధానం చెప్పాలన్నారు. బిజెపి ప్రభుత్వం నోట్లు రద్దు సమయంలో నల్లధనం తీసుకొచ్చి ప్రతిపేదవాడి కీ జన్ దాన్ ఖాతా ద్వారా 15 లక్షల రూపాయలు వేస్తానన్న మోడీ ఇంతవరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దేశంలో మోడీ అర్ధాంతరంగా లాక్ డౌన్ ప్రకటించి కోట్లాదిమంది పేద ప్రజలను, ముసలి వాళ్ళను, పిల్లలను, వేల కిలోమీటర్లు నడిపించి. కనీసం వారికి రవాణా సౌకర్యాలు కల్పించినటువంటి బిజెపి ప్రభుత్వానికి కుల మతాల మధ్య చిచ్చు పెట్టడమే తప్ప. ప్రజల బాగోగులు అవసరం లేవని అన్నారు. అలాంటి బిజెపి పార్టీ చెంత చేరిన రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం నుండి 5 వేల కోట్ల రూపాయల నిధులను తీసుకురావాలని అన్నారు. రేవంత్ రెడ్డి రెడ్ల పిచ్చితో రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను మరిచారని అన్నారు. డాక్టర్ వృత్తిలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ కెసిఆర్ ఫోటో పెట్టుకుని గెలిచారన్న విషయం మరిచి బిజెపిలో చేరి ఏం సాధిస్తారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేది కేసీఆర్ మాత్రమేనని బూర నర్సయ్య గౌడ్ తెలుసుకోవాలని అన్నారు. మునుగోడు ప్రజలు మతోన్మాద బిజెపిని అవినీతికర కాంగ్రెస్ ను ఓడించాలని అన్నారు. గతంలో శాసన సభ్యులుగా పని చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వల్లనే మునుగోడు అభివృద్ధి చెందిందని. ఈ అహంకార రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మునుగోడు అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఆర్ టి ఏ మెంబర్ తడక చంద్ర కిరణ్, హస్తినాపురం టిఆర్ఎస్ అధ్యక్షులు ఆందోజు సత్యం చారి, బీసీ జనరల్ సెక్రటరీ సిహెచ్ బిక్షపతి చారి, హస్తినాపురం డివిజన్ సెక్రెటరీ నల్ల నాగిరెడ్డి, నాయకులు శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.