విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి.. - కాంగ్రెస్ పార్టీ

Published: Wednesday November 02, 2022
చేవెళ్ల,నవంబర్ 01 (ప్రజాపాలన):

కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం  డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని తల్లారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండి ప్రాణం బలైందని,యాదయ్య మరణం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. మృతిని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో... చేవెళ సొసైటీ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ గుండాల రాములు, మాజీ ఎంపీటీసీ పెంటయ్య గౌడ్ , ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, తల్లారం సంజీవ, నవీన్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.