పొంచి ఉన్న ప్రమాదంఎండిన చెట్లను తొలగించాలి

Published: Friday July 29, 2022

మధిర జులై 27 ప్రజా పాలన ప్రతినిధిమండలంలోని దెందుకూరు నుండి విజయవాడ వైపు వెళ్లే రహదారిలో దెందుకూరు బ్రిడ్జి దాటిన తర్వాత ఆర్ అండ్ బి రహదారి పక్కన ఎండిన చెట్లు వంగి ఉన్నాయి. ఏ సమయాన ఏ వాహనదారుడుపై ఆ చెట్లు విరిగి పడతాయోనని అటువైపు వెళ్లే ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఆ రహదారిలో రెండు మూడు చోట్ల ఎండిన చెట్లు దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు ఆ రహదారిపై ప్రయాణాలు చేసే వాహనదారులు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.  భారీ వర్షాలు పడుతున్న తరుణంలో ఈదురు గాలులు వచ్చిన సమయంలో ఆ చెట్లు విరిగి వాహనదారులపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రమాదం జరగకముందే ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఎండిన చెట్లను తొలగించాలని ప్రజల కోరుతున్నారు.