గురుకుల, కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి:టియస్ యుటియఫ్

Published: Wednesday September 21, 2022

బోనకల్ సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి: గురుకుల, కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గా భవాని డిమాండ్ చేశారు. మంగళవారం గురుకులాలు కేజీబీవీ పాఠశాలల్లో జరిగిన సంఘ సభ్యత్వ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గురుకుల , కేజీబీవి ఉపాద్యాయులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, కేర్ టేకర్స్ ను నియమించాలని, సిపియస్ విధానాన్ని రద్దు చేయాలని,విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, 2019లో నియామకమైన గురుకుల ఉపాధ్యాయులకు పిఆర్సి అమలు చేయాలని వేతన వ్యత్యాసం లో వస్తున్న తేడాలను సరిచేయాలని, గెస్ట్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను పర్మినెంట్ చేయాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ కేజీబీవీ పాఠశాలల టైం టేబుల్ ను మార్పు చేయాలని అన్నారు. గురుకుల, కేజీబీవీ పాఠశాలల్లో వైద్య సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, బీసీ గురుకులాల రాష్ట్ర కో కన్వీనర్ లెవీన్, జిల్లా కన్వీనర్ అన్నం నాయుడు, టీఎస్ యుటిఎఫ్ మండల ఉపాధ్యక్షులు కంభం రమేష్, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, సదా బాబు పసుపులేటి నరసింహారావు, పి గోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.