కరోనా తో బాధపడుతున్న వృద్ధ దంపతులకు మెడికల్ కిట్ అందజేసిన యండిఆర్

Published: Thursday May 20, 2021

పటాన్చేరు, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా తో బాధపడుతున్న ఇద్దరు వృద్ధ దంపతులకు మెడికల్ కిట్ అందజేసిన యండిఆర్ ఫౌండేషన్, యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ కరోనా వ్యాధితో సహాయం కోరగా, మేము 2 రెండు వేల రూపాయల డాక్టర్ రాసి ఇచ్చిన  ని తీసుకుని ఉచితంగా అందజేశామని, మీ పరిసరాలలో ఎవరైనా నిరుపేద కుటుంబం ఆకలి తో కానీ, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ట్యాబ్లెట్లు తో నయం చేసే అవకాశం ఉంటే మా దృష్టికి వస్తే యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు తెలిపారు.