మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి విస్తృత పర్యటన పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేత

Published: Tuesday September 13, 2022
బోనకల్, సెప్టెంబర్ 12 ప్రజా పాలన ప్రతినిధి: టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా రావినూతల గ్రామంలో జడిపూడి సైదమ్మ కుమారులు నాగేంద్రకుమార్, ఫణికుమార్ లు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు.అలాగే చేబ్రోలు సీతమ్మ ఇటీవల చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయాలను అందజేశారు. పెద్దబీరవల్లి గ్రామంలో చింతల చెర్వు వీరభద్రం దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. బ్రాహ్మణపల్లిలో ఇటీవల మరణించిన దారగాని ప్రభాకర్, జెర్రిపోతులు ఆనందరావు, డెరాల మంగమ్మ, గాదె వెంకటరెడ్డి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆర్థిక సాయం ను అందజేశారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలకృష్ణారెడ్డిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా వారు అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, స్థానిక సర్పంచ్ లు సైదానాయక్, చిలకా వెంకటేశ్వర్లు, మందడపు తిరుమలరావు, జెర్రిపోతుల రవీందర్, కొమ్మినేని ఉపేందర్, తొండపు వేణు, పార్టీ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లిఖార్జున్, ఉమ్మినేని కృష్ణ, గాదె సర్వోత్తమ రెడ్డి, తమ్మారపు బ్రహ్మం, సాధినేని రాంబాబు, కన్నెటి సురేష్, గొడుగు కృష్ణ, బి. మురళి, భాగం నాగేశ్వరరావు, తోటకూర వెంకటేశ్వర్లు, బండి వెంకటేశ్వర్లు, ప్రదీప్, వెనిగండ్ల మురళి, బీరేల్లి కృష్ణ, కొరివి సురేష్, చిలకా నాగరాజు, కటారి నాగేశ్వరరావు, చండ్ర కృష్ణ, ఇరుగు నాగభూషణం, వంగాల కృష్ణ, మామిళ్ల కృష్ణయ్య, చింతలచెర్వు లక్ష్మినారాయణ, కొడాలి గోవిందరావు, వట్టికూటి సైదులు గౌడ్, గుడిపూడి రజనీకాంత్, ఎయిర్ టెల్ నరసింహారావు, ప్రవీణ్, చావా లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.