13.50లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభోత్సవం

Published: Monday April 05, 2021
మేడిపల్లి, ఏప్రిల్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ రాయంచ కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ అంచనా రూ 13.50లక్షల వ్యయంతో సి.సి రోడ్డు పనులను డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కోల్తూరు మహేష్ తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుర్ర శ్రీకాంత్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.