సీపీఐ నాయకులు తాటి వెంకటేశ్వరావు..

Published: Thursday December 15, 2022
 సీపీఐ నాయకులు తాటి వెంకటేశ్వరావు..
 
 తల్లాడ, డిసెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ  ఆధ్వర్యంలో తల్లాడ తహసిల్దార్ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, దళిత బంధు విషయంలో  అర్హులైన ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మద్దోజూ శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి ఓర్సు రమేష్, తమ్మారపు వెంకటేశ్వర్లు
మండల సహాయ కార్యదర్శి స్వర్ణ పాల్గొన్నారు.
 
 
 సీపీఐ నాయకులు తాటి వెంకటేశ్వరావు..
 
 తల్లాడ, డిసెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆ పార్టీ  ఆధ్వర్యంలో తల్లాడ తహసిల్దార్ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, దళిత బంధు విషయంలో  అర్హులైన ప్రతి ఒక్క దళితుడికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు మద్దోజూ శ్రవణ్ కుమార్, మండల కార్యదర్శి ఓర్సు రమేష్, తమ్మారపు వెంకటేశ్వర్లు
మండల సహాయ కార్యదర్శి స్వర్ణ పాల్గొన్నారు.