జేఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత ర్యాలీ..

Published: Saturday September 17, 2022
ఖమ్మం, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన న్యూస్): 
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఖమ్మంజిల్లా కేంద్రంలో ఖమ్మం జిల్లా జె యస్ యస్ డైరెక్టర్ వై. రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పరిషత్ అంబేత్కర్ సెంటర్ వద్ద జెండా ఊపి ర్యాలీ ప్రారంబించారు. ఈ సందర్బంగా డైరెక్టర్  రాధాకృష్ణ మాట్లాడుతూ  వృత్తి శిక్షణలో పాస్ అయినా లబ్దిదారులకు కన్వాకేషన్,గ్రాడ్యుయేట్లు అందించబడునని తెలిపారు. భారత ప్రభుత్వ ఆదేశాల అనుసారం స్కిల్ ఇండియా ద్వారా స్వయం ఉపాధి శిక్షణ పొందిన వారికి సుమారుగా 500మందికి కన్వాకెషన్స్ ప్రధానం చేయబడునని డైరెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జె యస్ యస్ ద్వారా శిక్షణ పొందిన వారందరు పాల్గొని సర్టిఫికెట్స్ పొందగలరని డైరెక్టర్ కోరినారు.
కార్యక్రమంలో  స్టాఫ్, రిశోర్స్ పర్సన్స్, లబ్ధిదారులు యువజనులు, మహిళలు, కళాకారులు పట్టణ ప్రముఖులు ఉన్నారు.