యూనివర్సల్ లో షీటీమ్ అవగాహన సదస్సు..
Published: Tuesday December 07, 2021
తల్లాడ, డిసెంబరు 6 (ప్రజాపాలన న్యూస్): తల్లాడలోని యూనివర్సల్ విద్యాలయంలో షీ టీం ప్రతినిధులు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వైరా సర్కిల్ పోలీస్ అధికారులు హాజరై విద్యార్థులకు షీ టీం గురించి వివరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, శశి కుమార్ మాట్లాడుతూ అమ్మాయిలు భయపడకుండా ధైర్యంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా షీ టీమ్ కు సమాచారం అందిచాలన్నారు. సమాచారం అందుకున్న వెంటనే తగిన పరిష్కారం ఉంటుందని అన్నారు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలని, అలాగే పాఠశాలలో ఉన్నప్పుడు పాఠశాల ఉపాధ్యాయులకు తమ సమస్యలు తెలియజేయాలని సూచించారు. చదువుతోపాటు మోరల్ వాల్యూస్ కూడా ఉండాలని ఆన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే 1098 కి కాల్ చేసి సమాచారం అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కరిచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో షి టీం మెంబర్ లతో పాటు పలువురు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Share this on your social network: