తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి

Published: Monday November 21, 2022

 తాండూర్ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ నుండి తాండూర్ కు రావడంతో తాండూరు పట్టణ నాయకులు ప్రజలు ఊరేగింపు తీసి ఘనంగా సన్మానించారు . విలేమున్ చౌరస్తా దగ్గర పెద్ద పూల దండతో ఆయనకు సన్మానం చేశారు. జెడ్ సెక్యూరిటీ సాయంతో ఆయనకు భారీ ఊరేగింపు తీశారు. పోలీస్ స్టేషన్ చౌరస్తా వినాయక చౌరస్తా నుండి భద్రప భద్రేశ్వర చౌరస్తా వరకు ఊరేగింపుగా తీసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాండ్ర పట్టణ అధ్యక్షులు  నయుం అప్పు, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, కౌన్సిలర్ విజయ రథం పై ఉండి ప్రజలకు స్వాగతం పలుకుతూ అభివాదం చేశారు, ఊరేగింపులో తాండూర్ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ ,తాండూర్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి ,దామర్ చెడు సర్పంచ్ నర్సిరెడ్డి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సంజీవరావు తదితరులు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.