రూ 20 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన

Published: Wednesday November 23, 2022
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) 

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్  శ్రీ సాయి ఎంక్లేవ్ యందు రూ 20 లక్షల వ్యయంతో  అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో  తెరాస సీనియర్ నాయకుడు  కొత్త రవి గౌడ్, కాలనీ అధ్యక్షుడు శివ ప్రసాద్, కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, సురేష్  (పెంటా  రెడ్డి కాలనీ )కోశాధికారి కామరాజు,  కాలనీ పెద్దలు శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్వర్లు, అంజయ్య, కృష్ణ, 28వ డివిజన్  అధ్యక్షుడు సంతోష, అధ్యక్షురాలు భార్గవి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా, కాలనీ మహిళమనులు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.