రిటైర్డ్ ఉపాధ్యాయుని కుటుంబాన్ని పరామర్శించిన మున్నూరు కాపు సంఘం నాయకులు
Published: Monday January 24, 2022
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో jilugumaadu గ్రామంలో మున్నూరు కాపు సభ్యులుపట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు శంకర్ శెట్టి సూర్యనారాయణ ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని ఆదివారం నాడు మధిర మండలం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆళ్ళ కృష్ణ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి తెలిపి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మందడపు వెంకటనారాయణ, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, చలమాల శ్రీనివాసరావు, దనిశెట్టి భాస్కర్ రావు, అన్నెం గోపాల్రావు, కళ్యాణపునాగరాజు, రామకృష్ణ, శంకర్ శెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: