అస్సొం సీఎం పై బెల్లం పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
Published: Tuesday February 15, 2022
బెల్లంపల్లి , ఫిబ్రవరి 14, ప్రజాపాలన ప్రతినిధి: అస్సొం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పై తక్షణమే కేసు నమోదు చేయాలని బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఒకటవ పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచిన ఉదంతంపై అస్సొం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంకటీ శ్రీనివాస్ తో పాటు 23వ వార్డు కౌన్సిలర్ గుజ్జ రవి. మాజీ కౌన్సిలర్ లు రోడ్డ శ్యామ్, చింతపండు శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఆదర్శ వర్ధన్ రాజు, ఎనగందుల వెంకటేష్, ఎలుక ఆకాష్, ఎం, శివ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: