*యువత స్వయం ఉపాధి వ్యాపార రంగాలలో రాణించాలి* -రియల్ ఎస్టేట్ ఆఫీసును ప్రారంబిచిన ఎమ్మెల్యే కా

Published: Monday December 05, 2022
చేవెళ్ల డిసెంబర్ 04,(ప్రజాపాలన):-

చేవెళ్ల మండల కేంద్రంలో  మీడియా జర్నలిస్ట్  గుట్టల శేఖర్ నూతన రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య,దళితరత్న అవార్డు గ్రహీత బురాన్ ప్రభాకర్ ,ఏఎంసీ చైర్మన్  మిట్ట వెంకటరెడ్డిలు కలిసి ప్రారంభించారు. యజమాని గుట్టల శేఖర్ ను వారు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం  వారు మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తూ మరో పక్క  రియల్ ఎస్టేట్ ఆఫీస్,స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపుడం  హర్షింపదగ్గ విషయమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.  బురాన్ ప్రభాకర్ మాట్లాడుతూ  యువకులు ఉద్యోగుల కోసం నిరీక్షిస్తూ  సమయాన్ని వృధా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలలో రాణించాలని అన్నారు. ఉపాధి పొందటంతో పాటు నలుగురికి కల్పించిన వారవుతారని,
యువత  స్వయం  ఉపాధి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాలతి కృష్ణా రెడ్డి,ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి,వైస్ ఎంపీపీ కర్నె శివ ప్రసాద్,తెరాసా మండల ప్రెసిడెంట్ పెద్దోళ్ల ప్రభాకర్, చేవెళ్ల పాత్రికేయులు, అడ్వకేట్ గుట్టల చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు.