గోరింకల గణేష్ కుటుంబాన్ని ఓదార్చిన మర్రి నిరంజన్ రెడ్డి
Published: Tuesday November 16, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 ప్రజాపలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం తిప్పాయి గూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గొరెంకల గణేష్ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం నియోజికవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి సోమవారం రోజు తిప్పాయి గూడ గ్రామానికి విచ్చేసి పార్థివ దేహానికి పూల మాల తో నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు, ఈ కార్యక్రమంలో మండల ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు ఏడ్మా నరేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చివరాల పాండు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమరయ్య, గ్రామ పెద్దలు, యువకులు, బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: