ఘనంగా నూతన సంవత్సరం వేడుకలు

Published: Tuesday January 03, 2023
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజా పాలన : ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించామని చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ మాట్లాడుతూ 2023 కొత్త సంవత్సరంలో మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వికారాబాద్ మున్సిపల్ ను జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మనల్ని ఎవరు విమర్శించిన దానికి ప్రతి విమర్శ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే  సరిపోతుందనే సిద్ధాంతంతో నేను ముందుకు వెళ్తున్నానని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసిన చైర్ పర్సన్, వికారాబాద్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చందర్ నాయక్, రాములు, మురళి, మాలే గాయత్రి లక్ష్మణ్, అనంతలక్ష్మి, మోముల స్వాతి రాజ్ కుమార్, దేవి రెడ్యానాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ జెడ్పిటిసి ముత్తహర్ షరీఫ్, నాయకులు విజయేందర్ గౌడ్, మోముల రాజ్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.