వేసవిలో మంచినీళ్ల సమస్య రాకుండా చర్యలు

Published: Saturday February 04, 2023
   కార్పొరేటర్ సుభాష్ నాయక్
మేడిపల్లి, ఫిబ్రవరి 3 (ప్రజాపాలన ప్రతినిధి)
వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని డివిజన్లోని అన్ని కాలనీలలో మంచినీళ్ల సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్టు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ తెలిపారు. ఈ మేరకు కార్పొరేటర్ సుభాస్ నాయక్ జలమండలి మేనేజర్ రమ్య ప్రియ, విజయపాల్ లతో కలిసి డివిజన్లో మంచినీళ్ల సమస్య ఉన్న కాలనీలలో పర్యటించారు. గేట్ వాల్స్, పైప్ లీకేజీలు, కొత్త పైప్ లైన్ వేయడం వంటి సమస్యలను గుర్తించారు. డివిజన్లోని ప్రజలకు వేసవిలో మంచినీళ్ల సమస్య రాకుండా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులను కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో బండారి శ్రీనివాస్, రవి సుకుమార్, రాజు, ధరణి కాలనీ వాసులు పాల్గొన్నారు.