గచ్చిబౌలి డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించండి

Published: Wednesday March 24, 2021
- గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 
 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంగళవారం కోరుతూ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలపై, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో చర్చించారు. కేశవ్ నగర్ వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న స్థానికులకు అధికారులు విద్యుత్ సేవలు నిలిపివేయడంతో, గత మూడురోజులుగా అంధకారంలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కేశవ్ నగర్ ప్రాంత ప్రజలకు విద్యుత్ సేవలు పునరుద్ధరించాలని కోరారు. అలాగే గౌలిదొడ్డి పంథాలో వార్డ్ కార్యాలయం నిర్మిచాలని, స్కైప్క్స్ లేక్‌వ్యూ అపార్ట్మెంట్ వద్ద మురుగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు.