వరద ప్రవాహాన్ని దారి మళ్ళించండి : మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర

Published: Sunday October 10, 2021
వికారాబాద్ బ్యూరో 09 అక్టోబర్ ప్రజాపాలన : భారీ వర్షం కారణంగా వరద ప్రవాహం ఇళ్లల్లోకి వస్తున్నాయని 18వ వార్డు ప్రజలు మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర దృష్టికి తెచ్చారు. శనివారం మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడకు చెందిన18వ వార్డు కౌన్సిలర్ కొండేటి కృష్ణ ఆధ్వర్యంలో కమీషనర్ తో కలిసి వరద ముంపు ప్రవాహాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో వరద ప్రవాహం ఇళ్ళలోకి రాకుండా పకడ్బంది చర్యలు చేపడుతామని భరోసా కల్పించారు. వార్డులోని రెండు అంతర్గత రోడ్లవైపు నుండి మోరీ లేదా అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతామని వివరించారు. రామయ్యగూడ గుట్టపైనుండి వచ్చే వరద నీరు కాలనీలోకి వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈ రాయుడు, ఎల్లయ్య ముదిరాజ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.