గ్రామాభివృద్దే లక్ష్యం సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి 9వ వార్డులో అండర్ డ్రైనేజీ పనులు ప్రారం

Published: Tuesday September 20, 2022
గ్రామాభివృద్దే మా లక్ష్యమని తామంతా కృషి చేయనున్నట్లు సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పోల్కంపల్లి అనుబంధ గ్రామం మాన్యగూడలో 9, 10 వ వార్డులో అంతర్గత మురుగు కాల్వలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటికే 90 శాతం సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో 32 కోట్లతో ఇబ్రహీంపట్నం నుండి అనాజ్ పూర్ వరకు రెండు లైన్ల రోడ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.త్వరలోనే గ్రామ పంచాయతీ నూతన భవన ఏర్పాటుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో  గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, ఎంపిటిసి చెరుకూరి మంగ రవీందర్,వార్డు సభ్యులు మన్నెమ్మ, యాదగిరి రెడ్డి,మల్లమ్మ,మహేందర్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area