ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం.
Published: Saturday November 27, 2021
మధిర నవంబర్ 25 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు మధిరలో.కొమ్మన మధు బాబు రైల్వే స్టేషన్ మాస్టర్. మధిర పుట్టినరోజు సందర్భంగా పేదలకు మతిస్థిమితం లేని వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 19 వ వార్డు కౌన్సిలర్ మాధవి దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ పేదలకు మతిస్థిమితం లేని వారికి మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే మిగిలిపోయిన భోజనాలను పాత దుస్తులను ఇటువంటి వారికి ఇవ్వటం వలన ఎంతో పుణ్యం దొరుకుతుందని. ఆశ్రమ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ మానవ సేవే మాధవ సేవగా ఎన్నో సేవా కార్యక్రమాలు మదిరలో నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: