రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయలు

Published: Tuesday December 06, 2022

శంకరపట్నం డిసెంబర్ 05 ప్రజాపాలన ప్రతినిధి:


శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామానికి చెందిన గుర్రం శంకర్ తన భార్య కనుకమ్మతో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గట్టుదుద్దెనపల్లి వద్ద కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో కనుకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఈఎంటి సురేష్, పైలట్ గోపికృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్లారు.