*అల్లవాడవాసికి అంబేద్కర్ జాతీయ అవార్డు,అరుదైన గౌరవం* *డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డు
*చేవెళ్ళమర్చి 13, (ప్రజాపాలన):-
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డుకు ఎంపికైన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని అల్లవాడ ఎంపీటీసీ కమ్మరి సత్యనారాయణ చారి తిరుపతి లో అవార్డు అందుకున్నారు. బహుజన రైటర్స్ సౌత్ ఇండియా 6 వ కాన్ఫరెన్స్ఆదివారం నాడు నిర్వహించారు. భారతదేశంలోని వివిధ రాష్టాలలో విభిన్న రంగాల్లో సామాజిక సేవలు అందించిన వారిని ఇటీవల జాతీయ అవార్డులకు బహుజన సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. అందులో భాగంగా తిరుపతిలో వివిధ రాష్ట్రాల వారికి జాతీయ అవార్డులను అందజేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ జిల్లాల వారికి అవార్డులు ప్రధానం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల పరిధిలోని పామెన గ్రామానికి చెందిన అల్లవాడ ఎంపీటీసీ కమ్మరి సత్యనారాయణ చారి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జాతీయ అవార్డును బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డును జాతీయ స్థాయిలో సతీసమేతంగా అందుకున్న ఏకైక జంటగా ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా యుద్ధనౌక గద్దర్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందించారు. సామాజిక కార్యక్రమాల్లో ప్రజలకు సేవలందించే మట్టిలో మణిక్యాలను వెలికి తీసి జాతీయ స్థాయిలో అవార్డులను అందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రమన్యన్, సౌత్ ఇండియా జనరల్ సెక్రెటరీ విష్ణువర్ధన్, బీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు మలగళ్ల గౌతమ్ ఉన్నారు.
Share this on your social network: