క్రీడా ప్రాంగణ స్థలాలను సందర్శించిన జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు

Published: Wednesday November 16, 2022

జన్నారం నవంబర్ 15 ప్రజాపాలన మంచిర్యాల జిల్లా పంచాయితీ అధికారి నారాయణరావు మంగళవారం జన్నారం మండలంలోని కవ్వాల్, హాస్టల్ తండా, కొత్తపేట్, సింగరాయిపేట్ గ్రామ పంచాయితీకి సంబంధించి తెలంగాణ క్రీడ ప్రాంగణ స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని పూర్తిస్థాయిలో నిర్మాణం కానీ క్రీడా ప్రాంగణములను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణరాణి, ఎంపీఓ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.