పరిమితికి మించి మట్టి తవ్వకాలు- పట్టించుకోని అధికారులు

Published: Saturday January 07, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి06 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్షకొండ గ్రామంలోని అతి పురాతన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రూ.10 లక్షలు మంజూరు చేయాలని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం టిటిడి బోర్డు సభ్యులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర ఆలయానికి టీటీడీ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంతుల శ్యామల తుకారం, ఎంపీటీసీ పొనుకంటి వెంకట్, ఉప సర్పంచ్ మంగలి పెళ్లి లక్ష్మణ్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు దోమకొండ చిన్న రాజన్న,ఉపాధ్యక్షుడు జోగ ధనంజయ, బీఆర్ ఎస్ నాయకులు మామిడి సురేష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పుటకోక్కుల నరసయ్య, తూటుకూర్ల ప్రేమ్ కుమార్, చింతకుంట శ్రీనివాస్, తాండ్ర సంజీవ్ , తదితరులు పాల్గొన్నారు.