మడుపల్లి లో భావనారుషి కళ్యానం

Published: Friday February 26, 2021
మధిర ఫిబ్రవరి 25 ప్రజా పాలన ప్రజా ప్రతినిధి: మధిర మండలంమడుపల్లి లో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి, అభయ ఆంజనేయ స్వామి, బద్రావతి-భావనారుషి, స్వామి వార్ల దేవాలయ 12 వ వార్షికోత్సవం సందర్భముగా ఈనెల 27వ తేదీ శనివారం ఉదయం 8:35 కు బద్రావతి భావనారుషి స్వామివారి కల్యాణోత్సవం జరుపబడును అని దేవాలయ కమిటీ నిర్వాహకులు యలమద్ది రాము, జిల్లా నాగేశ్వరరావులు తెలిపారు. స్వామివారి కళ్యాణము వీక్షించి, తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని వారు ఈ సందర్భంగా భక్తులను కోరారు ఈ సందర్భంగా ఉదయం 11 గంటల నుండి  కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.