శానిటేషన్ సిబ్బంది కి హైపో క్లోరైడ్ స్ప్రే పరికరాలను అందజేసిన మేయర్

Published: Tuesday May 18, 2021
బాలపూర్, మే17, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, లాక్ డౌన్ కి ప్రజలు అందరూ సహకరించాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని శానిటేషన్ సిబ్బందికి సోమవారంనాడు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసే పరికరాలను కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.... ప్రతి డివిజన్లలో వివిధ కాలనీలలో ఎప్పటికప్పుడు స్ప్రే  చేయాలని ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలిని, ప్రభుత్వపు నియమనిబంధనల ప్రకారం లాక్ డౌన్ కి ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, గూడేపు ఇంద్రసేన, బిజెపి నాయకులు శూర కర్ణ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.