చౌటుప్పల్ నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలో దివిస్ లేబరే

Published: Tuesday November 29, 2022
చౌటుప్పల్ నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) చౌటుప్పల్ మండలంలోని జై కేసారం గ్రామంలో దివిస్ లేబరేటరీ లేబరేటరీస్ లిమిటెడ్ వారు 19,18,506/- అంచనా విలువ గల రెండు అదనపు తరగతుల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొరూరి సైదుల్ మరియు గ్రామ ఎంపీటీసీ మందాల శ్రీశైలం చేతుల మీదగా శంకుస్థాపన నిర్వహించారు
అనంతరం గ్రామ సర్పంచ్ సైదులు మాట్లాడుతూ దివిస్ వారు రెండు తరగతు గదులు మంజూరు చేసినందుకు విద్యార్థులు గ్రామస్తులు పంచాయతీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దివిస్ వారు విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోటుబుక్కులు బ్యాగులు తగిన సామాగ్రి అందిస్తున్నారని కొనియాడారు ఇదివరకు కంప్యూటర్ లాబ్ తో పాటు కంప్యూటర్ ఇన్స్పెక్టర్ ని నియమించి బోధన చెప్పిస్తున్నారన్నారు విద్యాభివృద్ధికి గామాభివృద్ధికి దివిస్ వారు ఎల్లప్పుడు ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బండమీది యమునా యాదగిరి, వార్డ్ మెంబర్స్ మందల శేఖర్, పోలోజు శారద బిక్షమాచారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు,