బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఖమ్మం నుండే తొలి కేక మండల పార్టీ నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావే

Published: Thursday January 12, 2023
బోనకల్, జనవరి 11 ప్రజా పాలన ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీదే అధికారం అని, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండి కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు , రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మం లో జరిగే బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బుధవారం నాడు బోనకల్ ఎస్సార్ ఫంక్షన్ హాల్లో మండల పార్టీ అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన మండల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అందుకు నిదర్శనంగా నేడు కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు అంతా కోరుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను నిలదీస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వం లో ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన ఖమ్మం లో నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆ సభను విజయవంతం చేసేందుకు ప్రతి గులాబీ సైనికుడు బాధ్యత తీసుకొని పని చేయాలని కోరారు. ఈ సభ ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఉండబోతోందని వారు స్పష్టం చేశారు. ఈ సభ లో దేశ రాజకీయాలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని బి ఆర్ఎస్ జాతీయ పార్టీగా ఖమ్మం నుండే తొలి కేక ఉండనున్నది అన్నారు. ఈ సభలో మన పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ముగ్గురు సీఎం లు కేజ్రీవాల్ , పినారై విజయన్ , భగవంత్ మాన్ , మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరుకానున్నారని వారికి ఘన స్వాగతం పలుకుతూ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు బోనకల్ మండలంలోని మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.