*ఊరడమ్మ జాతర ఘనంగా జరిగింది* - ముఖ్య అతిథిగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ - దేవత ఆశీస్సులు ప్

Published: Tuesday December 20, 2022
చేవెళ్ల నియోజకవర్గం:(ప్రజాపాలన)
 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో సోమవారం ఊరడమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతరకు ముఖ్య అతిథులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, టి పి సి సి జనరల్ సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి, వేణు గౌడ్, నియోజకవర్గం పిసిసి మెంబర్ రాచ మల్ల సిద్దేశ్వర్, షాబాద్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, తదితర ముఖ్య నాయకులు హాజరై దేవత మూర్తిని దర్శించుకుని వారి ఆశీస్సులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొండల్ యాదవ్ మాట్లాడుతూ.... గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ఊరడమ్మ జాతరను ఈసారే ఘనంగా నిర్వహించామని మూడు రోజుల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని బోనాల ఊరేగింపు జరిపామని వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకున్నామని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో .... మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు యువకులు తదితరులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.