పొంగులేటి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ

Published: Friday October 29, 2021
బోనకల్, అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం మాజీ ఎంపీ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సందర్భంగా గురువారం నాడు బోనకల్ మండల కేంద్రంలోని దివ్య దయా వృద్ధాశ్రమం లో కేక్ కట్ చేసి పొంగులేటి శ్రీనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దివ్య దయ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మ నేని కృష్ణ, మండల నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, కోయి నేని ప్రదీప్, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, చింతలచెరువు లక్ష్మీనారాయణ, ఊటుకూరు బాలకృష్ణ, కొరివి సురేష్, ఏలి యేలు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.