మధిర మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday May 25, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : 23వ తేదీ మధిర పట్టణంలో సొసైటీ కార్యాలయంలో, మహాదేవపురంలో, దేశినేని పాలెంలో, పట్టణంలో గల ఎంప్లాయిస్ కాలనీ రెండో వార్డులో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మొదటిగా మాదిర సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షులు బిక్కి కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రైతులకు జీలుగు లను పంపిణీ చేశారు అనంతరం మహాదేవపురం గ్రామంలో సిసి రోడ్డు శంకుస్థాపన చేశారు, మరియు కరోనా నివారణ చర్యలు గ్రామాల్లో ఏ విధంగా చేపడుతున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారికి వివరించారు. అనంతరం దేశినేని పాలెం గ్రామంలో ఆంధ్ర మరియు తెలంగాణ బోర్డర్ లో చెక్ పోస్ట్ వద్ద ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలు తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలు ఏ విధంగా వస్తున్నాయి, ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని అనుమతిస్తున్నార లేదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధిర మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న టువంటి సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, ఎంపీపీ మేండెం లలిత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పట్టణ నాయకులు కనుమూరి వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు బీక్కి కృష్ణ ప్రసాద్, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, మెండేo వెంకయ్య, గోవిందరాజు, దేశినేని పాలెం మాజీ ఎంపీటీసీ పూర్ణ, బొద్దుకొలు సురేష్ తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.