3వ డివిజన్లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday April 28, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 3వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కో ఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న గౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ డివిజన్లోని పార్టీ కార్యాలయం వద్ద, శ్రీ సాయి రెసిడెన్షి కాలనీలో మరియు వెంకట సాయి నగర్లో తెరాస పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.