*సుశీల కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

Published: Saturday December 24, 2022

మధిర డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు స్థానికసుశీల మెమోరియల్ జూనియర్ కళాశాలలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ ఆధ్యాపకులు *బూసా కోటేశ్వరావు* *కొలగాని శ్రీనివాసరావు* ముఖ్యఅతిథిలుగా హాజరై క్రిస్మస్ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా *భూసా కోటేశ్వరరావు* మాట్లాడుతూ యేసు క్రీస్తు బోధనలు అందరూ ఆచరించదగినవని సర్వమానవాళి సోదరభావంతో శాంతి సౌబ్రాతృత్వంతో మెలగాలని సత్యం అహింస మార్గంలో ప్రయాణించాలని మన జాతిపిత *మహాత్మా గాంధీ* కూడా క్రీస్తు సందేశంలో సారాంశాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురాగలిగారని అటువంటి సమతా సారాంశం అందించిన *ఏసుక్రీస్తు* జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ *ముదిగొండ నరసింహారావు* అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ *పరుచూరి హరినాథ్* కామర్స్ అధ్యాపకులు *అమరనేని నవీన్* ఇంగ్లీష్ అధ్యాపకులు *గోవింద్* అర్థశాస్త్ర అద్యాపకులు *అద్దంకి రవికుమార్* ఎమ్ ఎల్ టి  అధ్యాపకులు *వెంకట్* కేమిస్త్రీ అధ్యాపకులు *శ్రీధర్*, ఎమ్ పి హెచ్ అధ్యపకురాలు *సంధ్య*  *అఫ్రోజ్* *వెంకట్*శ్రీనివాస్* *వెంకట కృష్ణ* బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు