సమ్మక్క- సారక్క కు నిలువెత్తు బంగారం చెల్లించుకున్న పిఎస్ఆర్
Published: Thursday February 17, 2022
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి 16, ప్రజాపాలన: తెలంగాణ కుంభమేళా..! మేడారంలో అతి పెద్ద ఎత్తున సమ్మక్క సారక్క గిరిజన జాతర అత్యంత వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ, ఏ.ఐ. సీ.సీ.సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వన దేవతలకు బుధవారం తన నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాస గృహంలో మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన తన ఎత్తు (75కిలోల బెల్లం) బంగారం గా మొక్కలు చెల్లించి పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన అథిదులు, మహిళలు ప్రసాదంగా బెల్లం స్వీకరించారు. వచ్చె ఎన్నికల్లో పిఎస్ఆర్ గెలుపోందాలని, ఇక్కడి ప్రజల కు ఆయన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: