కూరగాయల మార్కెట్ లో కూడా భౌతిక దూరం పాటించాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Saturday May 15, 2021
వికారాబాద్, 14 మే ప్రజాపాలన బ్యూరో : శుక్రవారం రోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని రైతు బజార్ ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిత్యవసరాలకు ఉదయం 6:00 గంటలనుండి 10:00 వరకు మాత్రమే సమయం ఉండటంతో ప్రజలందరూ ఒకే సారి మార్కెట్ వద్ద గుమి కూడకుండా భౌతిక దూరం పాటిస్తూ, అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకోవాలని సూచించారు. అల్లాగే ప్రతి ఒకరు భౌతిక దూరని పాటిస్తూ మాస్కు ధరించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, AMC చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బుచ్చయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ కుమార్, కౌన్సిలర్ అనంత్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు