రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రవిశంకర్ త్వరగా కోలుకోవాలని ప

Published: Monday January 24, 2022

కొడిమ్యాల, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రంలోని సాయి బాబా ఆలయంలోఆదివారం రోజున రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్  కరోనా నుండి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో మళ్లీ తమ సేవలు అందించాలని ఆయురారోగ్యాలతో ఉండాలని తెరాసమండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్, కొ ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్, ఆర్ బి ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేశం, తెరాస యూత్ మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేరెల్ల మహేష్, వాణిజ్య సెల్ మండల అధ్యక్షుడు రాగి రఘు నందన్, కొడిమ్యాల పట్టణ అధ్యక్షులు కొత్తూరి స్వామి, నాయకులు బైరి వెంకటి, మొగిలి పాలెం శ్రీనివాస్, కొలకాని సత్యం, చెల్ల లక్ష్మణ్, దీకొండ శేఖర్, కొలాపురం రమేష్, మొగిలి రాకేష్, శేఖర్ కాయిత రాజు, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.