అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ

Published: Thursday October 14, 2021
మేడిపల్లి, అక్టోబర్ 13 (ప్రజాపాలన ప్రతినిధి) హబ్సిగూడ డివిజన్‌లోని రామ్ రెడ్డి నగర్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి అలంకరణ పూజ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, హబ్సిగూడ మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి, టీంబిఎస్ఆర్ వ్యవస్థాపకుడు బేతి సుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి అలంకరణ మూల నక్షత్ర విశేష వలన చిన్నారులకు అక్షరాభ్యాసంకి కావాల్సిన విద్యా సామగ్రి పలకలు, బలపాలు, నోట్ పుస్తకాలు, పెన్నులు, దాదాపు 500 మంది చిన్నారులకు దాత టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, నిర్మాత,రాష్ట్ర అల్లుఅర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవి కుమార్ సహకారంతో ముఖ్య అతిథులకు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వహకుడు డీజే సాయి, హబ్సిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ బి వి చారి, టీఆర్ఎస్ నాయకులు నంది కంటి శివ, నరేష్ గౌడ్, భాను, గుమ్మల అశోక్, వంశీ రాజశేఖర్ సంపత్ సన్నీ సంతోష్ మహేష్ మహేందర్ శ్రీధర్ షఫీ ఫారుక్ రమేష్ కార్తీక్ ప్రవీణ్ గాయత్రి లింగం వినీత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.