ఇబ్రహీపట్నం జూన్ తేది 5 ప్రజాపాలన ప్రతినిధి.
Published: Monday June 06, 2022
*గడ్డ మల్లయ గూడెంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో మల్రెడ్డి రంగారెడ్డి చిలుక మధుసూదన్ రెడ్డి*
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని యాచారం మండలం గడ్డమల్లయిగుడెం.గున్గగల్ గ్రామాల్లో ఆదివారం ఉదయం రైతులు మహిళల తో భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగిందీ.. ఇట్టి కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై కాంగ్రేస్ పార్టీ రైతుడిక్లరేషన్ ని ప్రజలకు వివరించి , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జరిగింది..
ఇట్టి కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Share this on your social network: