ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి *ఉపాధ్యాయులందరు ఈ నెల 13,14 వ తేదీలలో జరిగే టీఎస్

Published: Thursday January 12, 2023

మంచాల మండలంలోని ఉపాధ్యాయా మిత్రులందరు జనవరి13, మరియు14 న జరిగే  టీఎస్ యుటిఎఫ్  5వ రాష్ట్ర మహాసభలకు తరలి రావాలని మంచాల మండల అధ్యక్షులు ఎమ్. డి. అజ్మత్ ఖాన్, మండల ప్రధానకార్యదర్శి బాలునాయక్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం అగపల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలలో  టీఎస్ యు టి ఎఫ్ 5 వ రాష్ట్ర మహాసభ గోడపత్రిక ను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచాల మండల అధ్యక్షులు ఎమ్ .డి.అజ్మత్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి బాలునాయక్, అగపల్లి ప్రధానోపాధ్యాయులు  రమాదేవి, ఉపాధ్యాయులు నీలిమ,పారిజాత, అనురాధ, రజిత, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభ మన్నెగూడలోని బీఎమ్ ఆర్. (సార్థ) కన్వెన్షన్ హాల్ లో జరుగుతున్నాయని వారు తెలిపారు.ఈ మహాసభలలో గౌరవ తెలంగాణ విద్యా శాఖా మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మరియు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొంటారని వారు తెలిపారు,