రూ24 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Published: Tuesday April 26, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్లోని పెంటారెడ్డి కాలనిలో రూ10 లక్షలు మరియు ఎస్సీ బస్తీలో 14 లక్షల ఎల్ఆర్ఎస్ నిధులతో అండర్ డ్రైనేజి పనులను స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహా, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ లతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు చినిగల్ల సంతోష్, ఉద్యమ నాయకులు ఉప్పరి విజయ్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు చినిగల్ల కుమార్, ప్రధాన కార్యదర్శి చీరాల జంగయ్య, కె నర్సింహా, చెంచల నర్సింగ్ రావు, శంకర్ స్వామి, ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు చక్లం శ్రీనివాస్, అంజిరెడ్డి పాల్గొన్నారు.