తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జడ్పి చైర్ పర్సన్

Published: Tuesday November 23, 2021
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజాపాలన : దౌల్తాబాద్ మండలంలో వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి పరిశీలించారు. వర్షాలు పడుతున్నందున కోతల సమయంలో రైతులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. జడ్పి చైర్ పర్సన్ తో పలువురు జడ్పిటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.