భట్టి విక్రమార్క సిఫార్స్ మేరకు కళాకారులకు జీవనభృతి 3,016 గా పెంపు అసెంబ్లీలో ప్రస్తావించిన మల

Published: Saturday May 29, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : 28వ తేదీ మధిర మున్సిపాలిటీ గతంలో మధిర మండల కళాకారుల వన సమారాదానలో పాల్గొన్న భట్టివిక్రమార్క గారికి కళాకారులు వినతి పత్రాన్ని అందజేశారు. వృద్ధ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు.గత ఐదారు నెలల నుంచి వృద్ధ కళాకారులకు పెన్షన్‌ అందడం లేదని వివరించారు. దీంతో పేద కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్‌ పెన్షన్లు ఇవ్వడం తో పాటు ప్రస్తుతం ఇస్తున్న  పింఛన్‌ను రూ.4వేలకు పెంచాలి అని వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయాన్ని మల్లు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో ప్రస్తావించి వృద్ధ కళాకారులకు పెన్షన్‌ పెంచేలా చర్యతిసుకోవాలని కోరడం జరిగిందిదాని ప్రతిఫలమే కళాకారుల పెన్షన్‌ పెంపు అని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిశోర్ అన్నారు