అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా పోలు శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక
Published: Monday September 26, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి:
బెల్లంపల్లి పట్టణ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షునిగా పోలు శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం సీనియర్ అనుభవ వైద్యులు, అజీజ్, లక్ష్మణాచారి లు, ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కమిటీని ఎన్నుకున్నామని,
సమావేశంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులుగా పోలు.శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా బొంతల.పోశం, తుంగపల్లి గంగాధర్, జూపాక బానేష్, ప్రధాన కార్యదర్శిగా రాంటేంకి మల్లికార్జున్, ముడిమాడుగుల శ్రీనివాస్, కోశాధికారిగా ఎండి యాకూబ్, సలహాదారులుగా ఎండి హైమద్, పెండం కనకయ్య , ప్రచార కార్యదర్శిగా నల్ల రవీందర్, లను నియమించినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అనుభవ వైద్యులు అజీజ్, లక్ష్మణాచారి నియోజకవర్గ కార్యదర్శి రమణాచారి ముఖ్య సలహాదారులు సజ్జన బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.
Share this on your social network: