వెంకటేశ్వర స్వామి దేవాలయంలోశ్రావణ మాస సందర్భంగా ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం

Published: Saturday August 06, 2022
ఆగస్టు 5 ప్రజాపాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం జమలాపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం సందర్భంగా మహిళలతో ప్రత్యేక పూజలుఓం నమో వెంకటేశాయతెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం పుణ్యక్షేత్రంలో శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకొని   మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన మరియు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు గ్రామంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . దేవస్థానం తరపున అందరికీ పూజా సామాగ్రి, శేష వస్త్రము, మరియు ప్రసాదములు ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రాజీవ్ శర్మ మరియు వేద పండితులు విజయ్ కృష్ణ మరియు అనంత యనచార్యులు గార్లు నిర్వహించారు . తదుపరి భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడం జరిగింది. విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం జరిపినాము. లోకకళ్యాణార్థం మరియు  సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెంట్ శ్రీ B. శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొని జయప్రదం చేసినారు.