సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Saturday September 17, 2022

ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 16 (ప్రజాపాలన, ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రక నిర్ణయం అని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ ఆన్సర్, ఎండి అమ్మద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని హడ్కో కాలనీ లో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎండి అహ్మద్ ఆధ్వర్యంలో కాలనీ వాసులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం  చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని, కెసిఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్, మున్సుర్, భీమ్ భాయ్, ఈశ్వర్, సుజాత, వెంకటేష్, పార్వతి, తదితరులు పాల్గొన్నారు.