బిజెవైయం అధ్వర్యంలో తిరంగ ర్యాలీ

Published: Monday August 16, 2021
జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు బండరాజు ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 15 ఆగస్ట్ ప్రజాపాలన : ప్రపంచదేశాలలో భారతదేశం అగ్రగామిగా కొనసాగతుందని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మదన్ పల్లి గ్రామ సర్పంచ్ బండరాజు ముదిరాజ్ కొనియాడారు. ఆదివారం రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అలంపల్లి నుండి అనంతగిరి వరకు త్రివర్ణ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బిజెపి నాయకులు మాజీ మంత్రి చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డిలు సంయుక్తంగా జెండా ఊపి త్రివర్ణ పతాకాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెవైఎం అధ్యక్షుడు మాట్లాడుతూ భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచిందని అన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని వివరించారు. మన శత్రు దేశాలు మన దేశానికి భయపడుతున్నాయని చెప్పారు. భారత దేశ యువత రాబోవు రోజుల్లో దేశ అభివృద్ధికి మరింత బాసటగా నిలవాలని పిలుపు ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియాతో స్వీయ పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పాండు గౌడ్ యు రమేష్ కుమార్ బీజేవైఎం నాయకులు కర్ణం శ్రీకాంత్ రవితేజ గుప్తా మహేష్ శ్రీనివాస్ సాయి కుమార్ శ్రీ కాంత్ గౌడ్ జగన్ గౌడ్ శ్రీహరి ప్రవీణ్ కుమార్ రమేష్ సాగర్ అభిలాష్ పండిట్ గోవిందు అశ్వ విజయ్ కుమార్ శ్రీ మంత్ కుమార్, హనుమంతు బీజేవైఎం జిల్లా అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.