సిపిఎస్ టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మధిర రూరల్

Published: Monday October 03, 2022
అక్టోబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు పూర్వ విద్యార్థులు సమ్మేళనం కార్యక్రమం ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సిపిఎస్) నందు ఆదివారం 1996-2001 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో సిపిఎస్ బాల్య మిత్రులు పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమం తో పాటు సిపిఎస్ స్కూల్లో టెన్త్ చదివే విద్యార్థులకు తమవంతుగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కేవీఆర్, వరప్రసాద్, అనిల్, నాగరాజు,గోపాల్, మధు, యాకోబ్, రవీందర్, హరిలాల్, హమీద్, రామకృష్ణ, శ్రీకాంత్, బి.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు.